Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను బోల్డ్... 24 కిస్సెస్‌కు సై అంటున్న హీరోయిన్

'అలా ఎలా' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హెబ్బా పటేల్. 'కుమారి 21 ఎఫ్', 'ఆడోరకం ఈడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నేను బోల్డ్... 24 కిస్సెస్‌కు సై అంటున్న హీరోయిన్
, బుధవారం, 10 జనవరి 2018 (17:03 IST)
'అలా ఎలా' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ హెబ్బా పటేల్. 'కుమారి 21 ఎఫ్', 'ఆడోరకం ఈడోరకం', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య సరైన ఆఫర్స్‌లేని హెబ్బాకి తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ తలుపు తట్టిందట.
 
సినిమా కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలీనట్టే సినీరంగంలో ఉండేవారి కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అస్సలు గెస్ చేయలేం. కొత్తనీరు వచ్చి పాత నీటిని కొట్టేసినట్టు కొందరికి స్టేటస్ అమాంతం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. హెబ్బా పటేల్‌కి కూడా అదృష్టం భలేగా తలుపు తడుతుంటుంది. 
 
‘మిణుగురులు’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులూ అందుకున్న దర్శకుజు అయోధ్య కుమార్. ఈయన తాజాగా తెరకెక్కించనున్న చిత్రం "శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్". ఇందులో హెబ్బాను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. 
 
ఈ చిత్రంలో హెబ్బా శ్రీలక్ష్మీ అనే పాత్ర చేయనుండగా, ఏకంగా 24 ముద్దులు ఇచ్చేందుకు రెడీ అయిందట. దీనిపై హెబ్బా మాట్లాడుతూ.. 'కుమారి 21 ఎఫ్... తరహాలోనే '24 కిసెస్'లో కూడా నాది చాలా బోల్డ్ క్యారెక్టర్. ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో, దీనికి కూడా అంతే క్రేజ్ వస్తుంది'అని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లెస్బియన్‌గా నిత్యామీనన్: హీరోయిన్‌తో రొమాన్స్