Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ఇండస్ట్రీ (SPB) బాలుని మరచిపోయిందా..?

Advertiesment
Has the Telugu film industry forgotten SP Balasubramanyam?
, శుక్రవారం, 9 అక్టోబరు 2020 (15:05 IST)
గాన గంధర్వుడు బాలు ఇక లేరు అని తెలిసి అందరూ ఎంతగా బాధపడ్డారో తెలిసిందే. ఇప్పటికీ బాలు లేరంటే నమ్మబుద్ధి కావడం లేదు. అయితే... చిత్ర‌సీమ‌లో ఎవ‌రైనా ఓ ప్ర‌ముఖుడు చ‌నిపోతే సంతాప స‌భ పెట్ట‌డం, నివాళి అర్పించ‌డం ప‌రిపాటి. కానీ… బాలు విష‌యంలో అది ఇంతవ‌ర‌కూ జ‌ర‌గ‌లేదు. `క‌రోనా వ‌చ్చిందండీ.. సోష‌ల్ డిస్టెన్సీ ఉండాలండీ` అని క‌బుర్లు చెప్ప‌డానికి ఇప్పుడు వీల్లేదు.
 
ఎందుకంటే... ఎంత క‌రోనా అయినా ప్రైవేటు కార్య‌క్ర‌మాలు బోల్డ‌న్ని జ‌రుగుతున్నాయిప్పుడు. అలాంటప్పుడు బాలు సంతాప సభ పెట్టకపోవడానికి కారణం ఏంటి..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉంటున్నారు. అలాంటప్పుడు అన్నీ తెలిసిన చిరంజీవిగారు కూడా ఎందుకు బాలు సంతాప సభ విషయంలో సైలెంట్‌గా ఉన్నారో అర్థం కావడం లేదు అనే కామెంట్స్ వినపడుతున్నాయి.
 
బాలుతో అందరికీ అనుబంధం ఉంది. అందరి సక్సెస్‌లో బాలు పాత్ర ఉంది. అలాంటప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారనేది సమాధనం లేని ప్రశ్నగా మారింది అంటున్నారు. బాలు మరణించారనే వార్త తెలిసినప్పుడు.. తెలుగు ఇండస్ట్రీలో వాళ్లు బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 
 
అంతన్నారు ఇంతన్నారు కానీ.. ఇప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే.. బాలుపై చూపించింది అంతా నిజమైన ప్రేమ కాదా..? అనిపిస్తుంది. మరి.. తెలుగు ఇండస్ట్రీ సైలెంట్‌గా ఉండటంపై వస్తున్న విమర్శలపై త్వరలోనే తాళం వేస్తారో లేదంటే కొనసాగేట్లు చేస్తారో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీలో అమితాబ్, బిగ్ ఎనౌన్స్‌మెంట్