Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోవిందా, శిల్పాశెట్టి కోర్టుకు హాజరు కావాల్సిందే: పాకూర్ కోర్టు

1996లో విడుదలైన 'ఛోటే సర్కార్' చిత్రంలో గోవిందా, శిల్పాశెట్టిల జంట కలసి నటించగా, బీహార్, యూపీలను కించపరుస్తూ, ఇందులో ఓ పాటను చిత్రీకరించారని ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. రెండు దశాబ్దాల నాటి కేసుల

Advertiesment
Govinda
, సోమవారం, 17 అక్టోబరు 2016 (15:17 IST)
1996లో విడుదలైన 'ఛోటే సర్కార్' చిత్రంలో గోవిందా, శిల్పాశెట్టిల జంట కలసి నటించగా, బీహార్, యూపీలను కించపరుస్తూ, ఇందులో ఓ పాటను చిత్రీకరించారని ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. రెండు దశాబ్దాల నాటి కేసులో ఈ నెల 18న కోర్టుకు హాజరు కావాల్సిందేననంటూ జార్ఖండ్‌లోని పాకూర్ కోర్టు నటుడు గోవిందా, నటి శిల్పాశెట్టిలను ఆదేశించింది.  
 
హీరో హీరోయిన్లతో పాటు పాట పాడిన గాయకుడు, దర్శకులపైనా కేసు వేశారు. ఆ తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా కేసు ఏళ్ల తరబడి వాయిదాలపై వాయిదాలతో సాగింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశించినా చిత్రానికి సంబంధించిన ఎవరూ కోర్టుకు రాలేదు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పాకూర్ కోర్టు న్యాయమూర్తి, వీరిని తీసుకురావాల్సిందేనని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
 
ఇటీవలే శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మంచి వ్యాపారవేత్తగా పేరు పొందారు. ట్యాంపర్ ప్రూఫ్ వాటర్ క్యాప్స్ తయారు చేసే వ్యాపారంలో ఉన్నారు. శిల్పాశెట్టి తండ్రి మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణించిన కొద్దిరోజులకే కేసులతో తలనొప్పి రావడంపై శిల్పాశెట్టి తలపట్టుకుని కూర్చుంది. ఇప్పటికే ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త అభియోగాలు ఎదుర్కొన్నారు. తాజాగా సినిమా పాటతో శిల్పాశెట్ట ివివాదంలో చిక్కుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు భర్త ముద్దుల జీతం...