Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబర్ 23న వస్తోన్న ''మజ్ను''.. చిట్టితల్లి ఉత్తరం రాసి సంబరిపడిపోతున్న నాని..

'మజ్ను'గా సెప్టెంబరు 23వ తేదీన థియేటర్లకు రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్ష

సెప్టెంబర్ 23న వస్తోన్న ''మజ్ను''.. చిట్టితల్లి ఉత్తరం రాసి సంబరిపడిపోతున్న నాని..
, గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:24 IST)
'మజ్ను'గా సెప్టెంబరు 23వ తేదీన థియేటర్లకు రాబోతున్నాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉన్నాడు. ఏడాదిన్నరగా వరుస హిట్లతో మంచి ఫామ్లో ఉన్న నాని.. తాజా చిత్రం 'మజ్ను' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'ఉయ్యాల జంపాల' ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా అలరించనుంది. నాని మార్క్ సెన్సిబుల్ కామెడీ హైలైట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో ఓ చిన్నారి తనకు లేఖ రాసి ఇచ్చిందని నాని సంబరపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. లేఖ ఫొటోను షేర్‌ చేశారు. ఓ చిన్న పాప సొంతంగా తయారుచేసిన ఈ లేఖను షూటింగ్‌ స్పాట్‌లో ఇచ్చింది. ఈ లెటర్ చూసి నాని సంబరపడిపోతున్నాడు. 'మజ్ను' చిత్రంతో నాని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'విశాల్‌'మైన హృదయం.. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన హీరో