Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత

ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత
, గురువారం, 10 జూన్ 2021 (09:06 IST)
సినీ దిగ్గజ నేపథ్యగాయకుడు, దివంగత ఘంటసాల వేంకటేశ్వర రావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ కన్నుమూశారు. ఆయన గురువారం తెల్లవారుజామున నగంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్ర సీమల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈయన... ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌గా తేలడం గమనార్హం. అయితే, ఆయన అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషయమించడంతో తుదిశ్వాస విడిచారు. 
 
రత్నకుమార్ మరణవార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. రత్నకుమార్‌కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
 
డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. 
 
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటివరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బన్నీ ఫ్యాన్స్‌లో టెన్షన్ టెన్షన్, అసలేమైంది?