Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొచ్చాడయాన్ వివాదంలో రజినీ కాంత్ భార్య లతా రజినీ కాంత్.. ఫోర్జరీ చేశారంటూ..?!

దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ భార్య లతా రజినీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ''కొచ్చాడయాన్'' చిత్రం హక్కులకు సంబంధించిన వివాదంలో లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పంది

Advertiesment
FIR
, శనివారం, 9 జులై 2016 (10:04 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ భార్య లతా రజినీకాంత్ వివాదంలో చిక్కుకున్నారు. ''కొచ్చాడయాన్'' చిత్రం హక్కులకు సంబంధించిన వివాదంలో లతా రజనీకాంత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించాలని ఆ నోటీసుల్లో కోరినట్లు సమాచారం. రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం హక్కులను లత అక్రమంగా విక్రయించారని యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసు నమోదు చేసింది. 
 
లతా రజనీకాంత్  కొన్ని పత్రాలను ఫోర్జరీ చేశారంటూ సదరు సంస్థ జూన్ 9, 2015న పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. "కొచ్చాడయాన్'' హక్కులకు సంబంధించిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించి సినిమా హక్కులను ఒక ఎంటర్టైన్‌మెంట్ కంపెనీకి ఆమె అమ్మారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో లతా ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి 150వ సినిమా హీరోయిన్‌ ఎవరో? జాక్వెలైన్ రూ.5కోట్లు డిమాండ్ చేసిందట!