Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతిపిత మహాత్మా గాంధీని రజనీకాంత్‌ కలవడమేంటి? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..!

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు

జాతిపిత మహాత్మా గాంధీని రజనీకాంత్‌ కలవడమేంటి? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..!
, గురువారం, 4 ఆగస్టు 2016 (15:53 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. కబాలి వీరాభిమానుల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కోసారి వారి అభిమానం హద్దులు దాటిపోతోంది. ఇప్పటికే అభిమానుల చేష్టలతో రజనీపై సోషల్ మీడియాలో రకరకాల జోకులు పేలుతున్నాయి. తాజాగా అభిమానులు పోస్ట్ చేసిన ఓ ఫోటో జాతిపిత మహాత్మాగాంధీని కూడా వివాదాల్లోకి లాగే పరిస్థితి ఏర్పడింది. 
 
1948లో మరణించిన జాతిపిత మహాత్మా గాంధీని 1950లో పుట్టిన రజనీకాంత్‌ కలవడమేంటి? నిజమా అనుకుంటున్నారా? నిజమేనండి. జాతిపితతో రజనీ కాంత్ మాట్లాడుతున్నట్లు గల ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్లు ఎదుర్కొంటోంది. మహాత్ముడితో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతున్నట్టున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
ఫోటో షాప్ సాయంతో రజనీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా నుంచి ఓ స్టిల్‌ తీసుకుని దానికి మహాత్ముడిని తగిలించి సోషల్‌ మీడియాలో వదిలేశారు. అంతటితో వదలకుండా స్వాతంత్ర్య ఉద్యమంలో రజనీకాంత్‌కు మహాత్ముడి అభినందనలు అంటూ కూడా కామెంట్స్ పెట్టేశారు. ఇక రజనీ సరికొత్త బాంబులు పేలుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన కలయిక.. పవన్ కళ్యాణ్‌తో క్రిష్ కొత్త ప్రాజెక్టు.. 'గౌతమీపుత్ర' తర్వాత!