Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీదేవి మృతిపై దుష్ప్రచారం వద్దు... ప్లీజ్ : ఏక్తా కపూర్

నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. శ్రీదేవి మరణంపై దుష్ప్రచారం చేయొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు.

శ్రీదేవి మృతిపై దుష్ప్రచారం వద్దు... ప్లీజ్ : ఏక్తా కపూర్
, సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (17:11 IST)
నటి శ్రీదేవి మరణంపై జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై బాలీవుడ్ నటి ఏక్తా కపూర్ స్పందించారు. శ్రీదేవి మరణంపై దుష్ప్రచారం చేయొద్దనీ ఆమె విజ్ఞప్తి చేశారు. సర్జరీల కారణంగానే ఆమె మృతి చెందిందని, సర్జరీలు వికటించడంతో గుండెపోటు వచ్చిందని సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఈ ప్రచారంపై ఆమె స్పందిస్తూ, చెడు ప్రచారం చేసేవాళ్లు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచన చేసింది. ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండా, హృదయ పనితీరు మెరుగ్గా ఉన్న వారికి కూడా గుండెపోటు వస్తుందన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలని కోరింది. 
 
ఎలాంటి హృద్రోగ సమస్యలూ లేకపోయినప్పటికీ, ప్రపంచంలో ఒక శాతం మందికి హఠాత్తుగా గుండెపోటు వస్తుందని తనకు తెలిసిన డాక్టర్ ఒకరు చెప్పిన విషయాన్ని ఏక్తా తన ట్వీట్ లో పేర్కొంది. పుకార్లు ప్రచారం చేసేవారు దీనిని గుర్తుపెట్టుకోవాలని ఆమె సూచించింది. ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, బాధపెట్టవద్దని నెటిజన్లకు ఏక్తా కపూర్ విజ్ఞప్తి చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీదేవి మరణంపై దుబాయ్ పత్రిక 'ఖలీజ్ టైమ్స్' సంచలన కథనం