Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

Chandrababu along with Dr. handed over the check. Mohan Babu, Vishnu Manchu

డీవీ

, శనివారం, 28 సెప్టెంబరు 2024 (16:20 IST)
Dr. Mohan Babu handed over the check to Chandrababu along with Vishnu Manchu
ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు, కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, విష్ణు మంచు అందజేశారు.
 
వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల విరాళాన్ని మోహన్ బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం ఇలా చెక్కుని అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ