Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక సిగ్గు వదిలేయాల్సిందే : దిశా పటానీ

Advertiesment
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక సిగ్గు వదిలేయాల్సిందే : దిశా పటానీ
, సోమవారం, 24 డిశెంబరు 2018 (14:39 IST)
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఖచ్చితంగా సిగ్గు వదిలిపెట్టాల్సిందేని సినీ నటి దిశా పటానీ వ్యాఖ్యానించింది. ఇటీవల కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీటిపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానించారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత సిగ్గు పడకూడదన్నారు. సినీ అవకాశాలు రావాలంటే ఫోటో షూట్లు తప్పనిసరని చెప్పుకొచ్చింది. ఫోటోలు దిగుతుంటే కొందరు ఒకే కోణం నుంచి చూస్తున్నారనీ, తనకు మాత్రం కెమెరా మాత్రమే కనిపిస్తుంది చెప్పింది. 
 
ఆ సమయంలో తన ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోబోనని, అసలు సిగ్గు అన్న పదం గురించి కూడా ఆలోచించనని చెప్పుకొచ్చింది. సిగ్గు గురించి ఆలోచించేవాళ్లు, ఈ పరిశ్రమ గురించే ఆలోచించకూడదని, అసలీ రంగంలోకి ప్రవేశించరాదని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ గ్లామర్ ప్రపంచమని, దానిలో ఉన్నప్పుడు అలాంటి వాటిని పట్టించుకోకూడదని దిశా పటానీ జూనియర్లకు సలహా ఇస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహా... ఎంత కమ్మగా ఉన్నాయ్...?