Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలియుగం పట్టణంలో చిత్రం కొత్త పాయింట్‌తో రాబోతోంది: రాజేంద్ర ప్రసాద్

Director Neelakantha Reddy, rajendra prasad and others

డీవీ

, శుక్రవారం, 1 మార్చి 2024 (15:06 IST)
Director Neelakantha Reddy, rajendra prasad and others
‘ఆ నలుగురు సినిమాలో విశ్వ కార్తికేయ నటించాడు. అప్పడాలు అమ్మి పెట్టడంలో నా గురువుగా ఆరేళ్ల వయసులోనే విశ్వ కార్తికేయ నాతో పాటు నటించాడు. ఇప్పుడు హీరోగా నటించాడు. ‘కలియుగం పట్టణంలో’ చిత్రం ద్వారా కొత్త పాయింట్‌తో రాబోతున్నాడు అని  రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 
 
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘కలియుగం పట్టణంలో’ మార్చి 22న రాబోతోంది. ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నిర్వహించారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
 
 నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ. రెండున్నర గంటలు అద్భుతంగా కథ చెప్పాడు. ప్రతీ సీన్ నా మైండ్‌లోకి ఎక్కించేశాడు. సినిమాల్లోకి దిగాలా? లేదా? నిర్మాతగా సాహసం చేస్తున్నానా? అని అనిపించింది. నాది ఒక షేర్ వేసుకో అని దర్శకుడికి చెప్పా. షూటింగ్ మాత్రం కడపలో చేయాలని కండీషన్ పెట్టాను. నా ఊరి జనాలకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంలోనే సినిమా రంగంలోకి వచ్చాను. ఇక్కడే ఉండి సంపాదించాలనే ఉద్దేశంతో అయితే సినిమాలు తీయడం లేదు. అజయ్ మ్యూజిక్, చంద్రబోస్, భాస్కర భట్ల పాటలు అద్భుతంగా వచ్చాయి. టీజర్, ట్రైలర్‌లను చూసి మా సినిమా కథను అంచనా వేయలేరు. ఈ స్టోరీ అంత కొత్తగా ఉంటుంది. మార్చి 22న మా చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి’ అని అన్నారు.
 
డైరెక్టర్ నీలకంఠ రెడ్డి మాట్లాడుతూ.. ‘చంద్ర ఓబుల్ రెడ్డి ప్రతీ విషయాన్ని తెలుసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు. పోస్టర్, టీజర్ ఇవన్నీ చూస్తుంటే సినిమాను బాగా తీశారనిపిస్తోంది. విశ్వ కార్తికేయ, ఆయుషి, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. సినిమా అంతా కూడా కడపలోనే తీయడం ఇదే మొదటి సారి. రమాకాంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. మార్చి 22న ఈ మూవీ రాబోతోంది. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
 
డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా కలియుగం పట్టణంలో సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన మీడియాకు థాంక్స్. నా సినిమా టీంకు థాంక్స్. మిగతా విషయాలన్నీ సినిమా ప్రీ-రిలీజ్  ఈవెంట్‌లో మాట్లాడతాను’ అని అన్నారు.
 
 విశ్వ కార్తికేయ మాట్లాడుతూ, కలియుగం పట్టణంలో సినిమా నాకు ప్రత్యేకం. మదర్ సెంటిమెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి చిత్రాన్ని తీశారు. చంద్ర ఓబుల్ రెడ్డి గారు మా అందరినీ చక్కగా చూసుకున్నారు. చరణ్ అన్న కెమెరా వర్క్ బాగుంది. అజయ్ సాంగ్స్, బీజీఎం బాగుంది. ఆయుషితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆమె ఎంతో సపోర్ట్ చేశారు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మీ గార్లతో పని చేయడం సంతోషంగా ఉంది. చిత్రా శుక్లా గారు ఓ స్పెషల్ రోల్ చేశారు. మా చిత్రం మార్చి 22న రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
 ఆయుషి పటేల్ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. మూవీల్లోకి వస్తున్నానంటే చాలా మంది నిరుత్సాహపరిచారు. ఈ సినిమాకు పని చేసిన రోజుల్లో ఏ రోజు కూడా అన్ కంఫర్టబుల్ గా అనిపించలేదు. ప్రతీ చోటా మంచి చెడూ అనేది ఉంటుంది. పిల్లల ఇష్టాయిష్టాలను తెలుసుకుని తల్లిదండ్రులు ప్రోత్సహించండి. నా తండ్రి నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. అన్ని ఎమోషన్స్ ఉన్న ఓ థ్రిల్లర్ మూవీ కలియుగం పట్టణంలో. చాలా ట్విస్టులుంటాయి. ఇలాంటి ఆలోచన మా దర్శకుడికి ఎలా వచ్చిందని అనుకున్నాను. కెరీర్ ప్రారంభంలోనే ఇంత మంచి పాత్ర లభించడం ఆనందంగా ఉంది  అన్నారు.
 
 నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, విశ్వ కార్తికేయ, ఆయుషి జంట బాగుంది. కొత్తగా వచ్చే నిర్మాతలను కాపాడుకునే బాధ్యత దర్శకులదే ఉంటుంది. గత నాలుగేళ్లుగా చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు చాలా మంది నిర్మాతలుగా వస్తున్నారు. యంగ్ నిర్మాతలు, కొత్తగా వచ్చే వారు కంటిన్యూగా సినిమాలు తీసేలా ప్లానింగ్ చేసుకోవాలి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరుకానున్న రామ్ చరణ్, ఉపాసన