Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబూ.. మారుతి ఈసారి ఏ కాపీ క‌థ‌తో వ‌స్తున్నావ్ నాయ‌నా..?

Advertiesment
Director Maruti
, మంగళవారం, 25 జూన్ 2019 (20:44 IST)
యువ ద‌ర్శ‌కుడు మారుతి ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో పెద్ద విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఆ త‌ర్వాత బ‌స్టాఫ్, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించాడు. అయితే... విక్ట‌రీ వెంక‌టేష్‌తో తెర‌కెక్కించిన బాబు.. బంగారం సినిమా... నాగార్జున నిర్ణ‌యం సినిమాని కాపీ కొట్టి తీసాడనే విమర్శలు వచ్చాయి. ఇటీవ‌ల తెర‌కెక్కించిన శైల‌జారెడ్డి అల్లుడు కూడా నాగార్జున అల్ల‌రి అల్లుడు సినిమాకి కాపీనే అంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో కెరీర్లో వెన‌క‌బ‌డ్డాడు. 
 
ఇప్పుడు మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ప్ర‌తిరోజు పండ‌గే అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈసారి స‌క్స‌స్ సాధించేందుకు  వైవిధ్య‌మైన క‌థాంశంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త‌గా చూపించనున్నాడ‌ట‌. జిఎ 2, యు.వి. పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పైన రూపొంద‌నున్న ఈ సినిమా సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. తేజు స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. తేజు, రాశీ ఖ‌న్నాపై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. 
webdunia
 
అయితే...ఈసారైనా కొత్త క‌థ‌తో సినిమా తీస్తున్నావా..? లేక పాత క‌థ‌ను తీసుకుని హిట్టు కొట్టాల‌నుకుంటున్నావా..? అంటున్నారు నెటిజ‌న్లు. కాపీ క‌థా..కొత్త క‌థ అనేది తెలియాలంటే ప్ర‌తి రోజు పండ‌గే రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియాలో స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... ఏంటది?