ధనుష్ ద్విపాత్రాభినయంలో 'ధర్మయోగి'.. దీపావళికి రిలీజ్
'రఘువరన్ బి.టెక్' హీరో ధనుష్ తాజాగా ఆర్.ఎస్.దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి' (ది లీడర్) పేరుతో తెలుగులో విడ
'రఘువరన్ బి.టెక్' హీరో ధనుష్ తాజాగా ఆర్.ఎస్.దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన 'కొడి' చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం 'ధర్మయోగి' (ది లీడర్) పేరుతో తెలుగులో విడుదలకానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సి.హెచ్.సతీష్కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్లో శుక్రవారంరాత్రి విడుదల చేశారు. హీరో ధనుష్ పాటల సీడీని విడుదల చేశారు.
నిర్మాత సి.హెచ్.సతీష్కుమార్ మాట్లాడుతూ... ''ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన 'కొడి' చిత్రంపై చాలా హైఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. తెలుగులో ధనుష్కి వున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ధనుష్ చేసిన రెండు క్యారెక్టర్స్ పూర్తి విభిన్నంగా వుంటాయి. ఈ చిత్రంలో త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, తమిళస్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్రను చేయడం విశేషం.
సూపర్స్టార్ రజినీకాంత్ 'కబాలి' చిత్రానికి సంగీతాన్ని అందించిన సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో 500కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. త్రిష ఈ సినిమా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో చేస్తోంది. ఈ చిత్రం పెద్ద హిట్ అయి మా విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బేనర్కి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.