Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎట్ట‌కేల‌కు... డైరెక్ట‌ర్ దేవ క‌ట్ట కొత్త సినిమా స్టార్ట్ చేసాడు..!

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్‌లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ప్రేక్ష‌కులే కాకుండా ద‌ర్శ‌కులు

ఎట్ట‌కేల‌కు... డైరెక్ట‌ర్ దేవ క‌ట్ట కొత్త సినిమా స్టార్ట్ చేసాడు..!
, బుధవారం, 23 మే 2018 (22:22 IST)
శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్‌లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్స‌స్ సాధించ‌డంతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ప్రేక్ష‌కులే కాకుండా ద‌ర్శ‌కులు సైతం ప్ర‌స్ధానం చిత్రాన్ని మెచ్చుకున్నారంటే... దేవ క‌ట్ట టాలెంట్ ఏమిటో అర్ధం అవుతుంది. 
 
అయితే... ప్ర‌స్ధానం త‌ర్వాత దేవ‌క‌ట్ట ఆటోన‌గ‌ర్ సూర్య తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో కెరీర్లో బాగా వెన‌క‌బ‌డిన దేవ క‌ట్ట చాలా గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపడుతున్నారు. అది కూడ హిందీలో. తన‌కు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టిన ‘ప్రస్థానం’ సినిమానే హిందీలో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ జూన్ 1న ముంబైలో మొదలుకానుంది. ఇందులో స్టార్ హీరో సంజయ్ దత్, యువ హీరో అలీ ఫజల్ ప్రధాన పాత్రలు చేయనుండగా అమైరా దస్తూర్ కథానాయిక పాత్రను పోషించనుంది. మ‌రి... ఈ సినిమా అయినా దేవ‌క‌ట్ట‌కి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షకలక శంకర్ ‘డ్రైవర్ రాముడు’.. టీజర్ రిలీజ్..!