Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాసరి మృతిపై అనుమానాలున్నాయి.. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు: పెద్ద కోడలు సుశీల

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్ద

దాసరి మృతిపై అనుమానాలున్నాయి.. మాకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు: పెద్ద కోడలు సుశీల
, గురువారం, 1 జూన్ 2017 (09:36 IST)
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అంత్యక్రియలు పూర్తయిన 24 గంటలు కూడా గడవకముందే.. ఆయన మృతిపై అనుమానాలున్నాయంటూ పెద్ద కోడలు సుశీల ఆరోపించారు. దాసరి పెద్ద కుమారుడు ప్రభు భార్య సుశీల కావడం విశేషం. వారిద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ  నేపథ్యంలో తమ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవమే.. అయితే ఇంకా తనకు, తన భర్తకు విడాకులు కాలేదని సుశీల తెలిపారు.
 
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఎలా? అనారోగ్యం పాలయ్యారు? గతంలో తాను వచ్చినప్పుడు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశానన్నారు. ఆసుపత్రి ఉండగా పరామర్శించేందుకు వచ్చే తనను కనీసం ఆయన్ని చూసేందుకు కూడా అనుమతించలేదని సుశీల చెప్పారు. మే 4న మామగారిని చూసేందుకు వెళ్తే.. ఆయన ప్రేమగా మాట్లాడారు.
 
అంతేకాదు.. తన కొడుకును సినీ రంగానికి పరిచయం చేస్తానని మాటిచ్చారని సుశీల వెల్లడించారు. తమకు ఆస్తిలో భాగం ఇవ్వలేదని సుశీల తెలిపారు. ఎంతోమందికి జీవితాలిచ్చానని మీకు అన్యాయం చేయనని.. రెండు వారాల తర్వాత రండి.. తప్పకుండా న్యాయం చేస్తానని మామయ్య హామీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడిన రాజమౌళి.. కొత్త చిత్రానికి కసరత్తు ప్రారంభం