Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుద్ధుని ఫేస్‌పై అమలాపాల్ కాలు పెట్టేసింది.. ఎందుకిలా చేసింది..? సారీ చెప్తుందా?

నటి అమలా పాల్ గురించి తెలిసిందే. సినీ కెరీర్ కోసం తన భర్తను కూడా పక్కన బెట్టేసి.. సినీ అవకాశాలతో ముందుకు దూసుకెళ్తోంది. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించకూడదని అత్తింటివారు షరతులు పెట్టడంతో అమలా పాల్ మ

Advertiesment
Controversy
, శనివారం, 1 ఏప్రియల్ 2017 (16:28 IST)
నటి అమలా పాల్ గురించి తెలిసిందే. సినీ కెరీర్ కోసం తన భర్తను కూడా పక్కన బెట్టేసి.. సినీ అవకాశాలతో ముందుకు దూసుకెళ్తోంది. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించకూడదని అత్తింటివారు షరతులు పెట్టడంతో అమలా పాల్ మనస్తాపానికి గురైంది. ఇంకా భర్త దర్శకుడు విజయ్ నుంచి విడాకులు కూడా తీసుకుంది. తాజాగా తమిళంలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌లోనూ ఓ సినిమా ఛాన్స్ కొట్టేసింది. 
 
తాజాగా అమలాపాల్ వార్తల్లోకెక్కింది. ఇంకా అమలాపాల్ వివాదంలో చిక్కుకుంది. యోగా చేస్తున్న పిక్స్‌ను ఇటీవలే అమలాపాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలే ప్రస్తుతం వివాదానికి దారితీశాయి. అమ్మడు చేసే యోగా ఆసనాలపై సోషల్ మీడియా విమర్శలు వస్తున్నాయి. ఆసనాలు ఎలాగున్నాయనే విషయాన్ని పక్కనబెడితే.. అమ్మడు యోగాలో భాగంగా తలకింద కాళ్లుపై లేపుతూ ఓ ఫోటోకు ఫోజు ఇచ్చింది. 
 
అయితే అమలాపాల్ బుద్ధుని ముఖం కలిగిన ఫోటోపై కాలు పెట్టడం వివాదానికి కారణం అయ్యింది. దీనిపై నెటిజన్లు బుద్ధుడు తప్ప ఇంకెవరు కనిపించ లేదా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా అమలాపాల్ తాను యోగా చేస్తున్న కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 
 
రకరకాల ఆసనాలు వేసింది. అమలాపాల్ బ్యాక్ గ్రౌండ్‌లో బుద్ధుడు బొమ్మ కనిపించడం ఈ వివాదానికి కారణమైంది. ఓ పిక్‌లో బుద్ధుడుపై అమలా పాల్ కాలు పెట్టినట్టుగా ఉండడం కాంట్రవర్సీకి దారి తీసింది. దీనిపై అమలాపాల్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పెరిగిపోతోంది. మరి అమలాపాల్ సారీ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతుందో లేకుంటే కొన్నాళ్లు ఈ వివాదాన్ని నాన్చుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంత వేశ్య అయితే మాత్రం ఇంత పచ్చిగానా...?