Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వార్తల్లోకి వేణు మాధవ్: చనిపోయినట్లు వార్త.. టీవీ ఛానల్‌పై ఫిర్యాదు..!

Advertiesment
Comedian Venu Madhav rubbishes death rumours
, మంగళవారం, 10 మే 2016 (15:53 IST)
స్టార్ కమెడియన్ వేణు మాధవ్‌ ఓ టీవీ ఛానల్‌పై కేసు పెట్టడం ప్రస్తుతం టాలీవుడ్ టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. సెలెబ్రిటీలను బతికుండగానే చంపేసే కల్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వ్యాప్తి చెందుతోంది. ఇదే వ్యవహారం వేణుమాధవ్ విషయంలోను జరిగింది.

వేణు మాధవ్ చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నమ్మేసి ఓ టీవీ ఛానెల్ ఈ వార్తను ప్రసారం చేసింది. దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో వేణు మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై మీడియాతో మాట్లాడేందుకు అతను నిరాకరించాడు. 
 
కాగా సోషల్ మీడియాలో ఇటీవల ప్రముఖ కమెడియన్ సెంథిల్‌ కూడా మరణించారని వార్తలొచ్చాయి. అయితే తాను బతికే వున్నానని, మరణించినట్లు వచ్చిన వార్తలన్నీ అసత్యమని తేల్చి చెప్పారు. అలాగే స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ చనిపోయే ముందు కూడా ఇలాంటి దుష్ప్రచారమే జరిగిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ ఫోటోషూట్: కొత్త లుక్ అదురుతుందా?