Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ పై ఆరాతీసిన చంద్రబాబు - రూ. కోటి సాయం అందజేత

Pawn, chandrababu

డీవీ

, శనివారం, 7 సెప్టెంబరు 2024 (13:09 IST)
Pawn, chandrababu
నేడు వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్, సి.ఎం. చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ ఆరోగ్యంపై ఆరా తీశారు. గత కొద్దిరోజులుగా పవన్ ఫీవర్ తో వున్నారు. అందుకే వరదబాధితుల సహాయ చర్యల్లో పాల్గొనలేకపోయారు. ఇక  ముఖ్యమంత్రి సహాయ నిధికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ రూ. కోటి అందించారు. 
 
విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన రూ. కోటి చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందచేశారు. తొలుత కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఇండియన్-2' చిత్రం ఫ్లాప్ కావడం సంతోషంగా ఉంది : రేణూ దేశాయ్