Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ విశ్వసుందరికి మద్రాసు హైకోర్టు నోటీసులు...

ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు.

మాజీ విశ్వసుందరికి మద్రాసు హైకోర్టు నోటీసులు...
, గురువారం, 17 ఆగస్టు 2017 (09:27 IST)
ప్రముఖ బాలీవుడి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈమె 2008లో విదేశాల నుంచి ఓ లగ్జరీ కారును నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్నారు. ఓ విదేశీ నౌకలో చెన్నై హార్బర్‌కు వచ్చిన ఈ విలాసవంతమైన కారును నిబంధనలకు విరుద్ధంగా ఆమె తీసుకున్నారని ఆరోపిస్తూ అధికారులు ఎగ్మూర్ ఆర్థిక నేరాల న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా ఆమె ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో జూన్‌లో ఆ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 18లోగా కోర్టు విచారణకు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మిని పోలిన మరో బ్రహ్మి... ఓర్ని యంకమ్మో... ఎవరు..?