Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓమ్ కార్ రియల్టర్స్ కేసు: సచిన్ జోషి అరెస్ట్

ఓమ్ కార్ రియల్టర్స్ కేసు: సచిన్ జోషి అరెస్ట్
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (15:24 IST)
ప్రముఖ నటుడు అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. 'ఒరేయ్ పండు', 'మౌనమేలనోయి', 'జాక్ పాట్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సచిన్ జోషిని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
 
ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు.

ఇకపోతే గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్‌లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాస్‌ ఐట‌మ్ సాంగ్ లో అన‌సూయ