Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాక్సిడెంట్ రోజు ఏం జ‌రిగింద‌ని విచారించిన బ‌న్నీ

యాక్సిడెంట్ రోజు ఏం జ‌రిగింద‌ని విచారించిన బ‌న్నీ
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (19:36 IST)
Allu arjun aplo
సాయిధరమ్‌ తేజ్ బైక్ ప్ర‌మాదానికి గురై హైదరాబాద్‌లోని అపోలో  చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 10న తన స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. హెల్‌మెట్ వుండ‌డంతో సేఫ్ అయ్యాడు. ఈ విష‌యం తెలిసిన చిరు కుటుంబీకులు హుటాహుటిన వ‌చ్చి ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు. ఇక అల్లు అర్జున్ రాలేక‌పోయాడు. పుష్ప షూటింగ్ బిజీలో వుండ‌డం వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు వాక‌బు చేస్తూనే వున్నాడు.
 
అయితే గ‌త రెండురోజులుగా ఎటువంటి అప్‌డేట్ సాయితేజ్ గురించి తెలియ‌క‌పోవ‌డంతో అంతా గంద‌ర‌గోళంలో వున్నారు. శుక్ర‌వారంనాడు బ‌న్నీ అపోలోకి వెళ్ళి సాయితేజ్ వార్డ్‌కు వెళ్ళి బ‌య‌ట‌నుంచే చూసి వ‌చ్చారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఇంకా కోలుకోలేద‌ని తెలుస్తోంది. ప్ర‌మాదం ఏమీలేద‌ని వైద్యులు వెల్ల‌డించారు. సాయితేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డాక్ట‌ర్ల‌ను ఆసుప‌త్రికి ఏద‌శ‌లో వ‌చ్చారో ఎటువంటి దెబ్బ‌లు త‌గిలియానో పూర్తి ఆరా తీశారు. మీరు చేయాల్సింది చేస్తున్నారు. అంతా భ‌గ‌వంతుని ఆశీర్వాదం అంటూ అన‌డం అక్క‌డివారిని క‌ల‌చివేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్ 3- .షూటింగ్ హైద‌రాబాద్‌లో తిరిగి ప్రారంభం