'శ్రీమంతుడు' సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం ''బ్రహ్మోత్సవం'' కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలన్నాయి. మహేష్ బాబుతో ''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'' లాంటి మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఉదయం నుండి బ్రహ్మోత్సవం సినిమా సందడి మొదలైంది. ఉదయం 8 గంటలకే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన మొదలుకావడంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానుల సందడి వాతావరణం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల నుంచి మహేష్ అభిమానులు ''బ్రహ్మోత్సవం'' సంబరాలకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లను ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. కాగా గురువారం అమెరికాలో విడుదలైన ఈ సినిమాకి రాత్రి 8 గంటల సమయానికి కోటి రూపాయలు వసూళ్లు దాటిందని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర్ తెలిపారు. మొత్తమ్మీద సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోందని అభిమానులు చెబుతున్నారు.