Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#BBTeluguGrandFinale: గ్రాండ్ ఫినాలే విజేతగా వీజే సన్నీ

#BBTeluguGrandFinale: గ్రాండ్ ఫినాలే విజేతగా వీజే సన్నీ
, ఆదివారం, 19 డిశెంబరు 2021 (22:29 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఆదివారం రాత్రి జరిగింది. ఈ గ్రాండ్ ఫినాలే విజేతగా వీజే సన్నీ నిలిచారు. దీంతో ఆయనకు రూ.50 లక్షల నగదు బహుమతి అందజేయగా, షణ్ముఖ్‌కు రూ.25 లక్షల నగదు పురస్కారం ఇచ్చారు. మొత్తం 15 వారాల 100 రోజుల పాటు అనేక మలుపులు, పలు భావోద్వేగాలు, ఏడుపులు, నవ్వులు అనేకానేక విధాలుగా ఈ ఐదో సీజన్‌ను హోస్ట్ అక్కినేని నాగార్జున విజయవంతంగా పూర్తిచేశారు. 
 
అంతకుముందు.. ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఐదుగురు ఎంపికయ్యారు. వీరిలో తొలుత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సిరి. ఫైనల్ వారానికి ఐదుగురు అర్హత సాధించగా, వారిలో సిరి ఒకరు. అయితే, హౌస్‌లోకి వెళ్లిన హీరోయిన్ రష్మిక మందన్నా.. సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సిరి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆమెను స్టేజీపైకి తీసుకొచ్చారు. 
 
ఈ సందర్భంగా సిరి మాట్లాడుతూ, బిగ్ బాగ్ ఇంట్లో తన ప్రస్థానం అద్భుతంగా సాగిందన్నారు. తాను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నానని తెలిపింది. సిరి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో మానస, సన్నీ, శ్రీరామచంద్ర, షణ్ముక్ ముగిలిపారు. ఆ తర్వాత మానస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. 
 
ఆ తర్వాత కంటెస్టెంట్లకు డబ్బు ఆఫర్ చేసేందుకు 'శ్యామ్ సింగారాయ్' టీమ్ నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సాయిపల్లవి, కృతిశెట్టిలు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. కానీ డబ్బు కోసం హౌస్‌లో మిగిలిన నలుగురు ఏమాత్రం ఆసక్తి చూచడం లేదు. దీంతో చివరగా నలుగురు బొమ్మలు వేలాడదీశారు. 
 
లీవర్ లాగినపుడు ఎవరి బొమ్మ కిందపడిపోతుందో వారు ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ముందుగానే ప్రకటించారు. ఇందులో మానస్ బొమ్మ కిందపడిపోవడంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్‌లో మిగిలింది శ్రీరామ్, షణ్ముఖ్, వీజే సన్నీలు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరి విజేతగా నిలువనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bigg Boss 5 Telugu grand finale: నరాలు తెగే ఉత్కంఠ, కానీ చిట్టితో ఆటాపాటలతో షణ్ణు, సన్నీ