Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"దంగల్" కలెక్షన్లు రూ.2 వేల కోట్లు.. కానీ ఫొగట్ కుటుంబానికి ఇచ్చింది ఎంతో తెలుసా?

babita phogat

ఠాగూర్

, గురువారం, 24 అక్టోబరు 2024 (13:47 IST)
అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన చిత్రం "దంగల్". గత 2016లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. మహావీర్ ఫొగట్ తన కుమార్తెలను ఎలైట్ రెజ్లర్‌లుగా ఎలా మార్చారనే దాన్ని చుట్టూత ఈ కథ తిరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు కూతుళ్లు దేశానికి పతకాలు సాధించడం చూపించారు. అయితే, ఈ చిత్రం ఏకంగా రూ.2 వేల కోట్ల మేరకు కలెక్షన్లు రాబడితే మహావీర్ ఫొగట్ కుటుంబానికి మాత్రం కేవలం కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు స్పూర్తిగా నిలిచిన బబితా ఫొగట్ తాజాగా ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. 
 
రెజ్లింగ్‌కు అధికారికంగా గుడ్‌బై చెప్పిన బబితా ఫొగట్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆమె తాజాగా ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా "దంగల్" సినిమా మేకర్స్ నుంచి తమ కుటుంబానికి అందిన ఆర్థిక వివరాలను ఆమె వెల్లడించారు. తన కుటుంబానికి మేకర్స్ నుంచి కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 'దంగల్' సినిమాకు వచ్చిన రూ.2,000 కోట్లలో ఫోగట్ కుటుంబానికి కేవలం రూ.1 కోటి మాత్రమే వచ్చింది అని తెలిపారు. 
 
అయితే, ఇంత తక్కువ మొత్తం దక్కినందుకు మీకు బాధగా అనిపించలేదా? అని అడిగిన మరో ప్రశ్నకు బబితా తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. తన కుటుంబం ఉద్దేశం ఈ మూవీ నుంచి డబ్బు ఆశించడం కాదన్నారు. ప్రజల నుంచి గౌరవం, ప్రేమను సంపాదించడం మాత్రమే అని అన్నారు.
 
ఈ సందర్భంగా తన తండ్రి తమతో ఒక విషయం చెప్పారని బబితా తెలిపారు. అదేంటంటే.. తమకు ప్రజల ప్రేమ, గౌరవం మాత్రమే కావాలి, డబ్బు ముఖ్యం కాదన్నారని ఆమె పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ షోలో ఆట కంటే కంటెస్టెంట్స్ గోలే ఎక్కువగా ఉందా?