Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా అందమైన మనవరాలులో భాగస్వామి అయినందుకు సంతోషంగావుంది : ఆశా భోంస్లే

zanai bhosle

ఠాగూర్

, మంగళవారం, 12 మార్చి 2024 (15:08 IST)
"ది ప్రైడ్ ఆఫ్ భారత్ - ఛత్రపతి శివాజీ మహారాజ్" చిత్రంలో తమ అందమైన మనవరాలు జనై భోంస్లే భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ గాయని ఆశా భోంస్లే వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. తన మనవరాలు జనై భోంస్లే భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతుందని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నా మనవరాలు భాగం కావడం పట్ల నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పారు. 
 
పైగా, ఆమె భారతీయ చిత్రపరిశ్రమలో జనై కోరుకుంటున్న గమ్యస్థానాన్ని చేరుకుంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆమెకు, సినిమా తీస్తున్న దర్శకుడు సందీప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని ఆశా భోంస్లే తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ భార్య రాణి సాయి భోంసాలే పాత్రలో ఆమె మనవరాలు జనై కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా సందీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇమ్మెరో స్టూడియో, లెజెండ్ స్టూడియో కలిసి దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
ఈ చిత్రంలో జనైని ఎంపిక చేయడం పట్ల చిత్ర నిర్మాత సందీప్ సింగ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "ఛత్రపతి శివాజీ మహారాజ్ కుటుంబ వంశానికి చెందిన వారసుడు, చాలా తెలివైన, నిష్ణాతులైన కుటుంబంతో తన వంశాన్ని పంచుకున్న జనైని పరిచయం చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. దివంగత లతా మంగేష్కర్‌జీ, ఆశా భోంస్లేజీలకు మనవరాలు. రాణి సాయి బాయి పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్శకుడు సూర్య కిరణ్ మృతికి మాజీ భార్యనే కారణం : కరాటే కళ్యాణి