అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్వీట్ పెద్ద దుమారాన్ని రేపింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవి శంకర్పై ట్వింకిల్ ట్వీట్ చేయడం సంచలనమైంది. యోగా గురువు కూడా అయిన రవి శంకర్ “యోగా చేసేటప్పుడు, చెప్పేటపుడు సగం గడ్డం ఆయన నోట్లోకే వెళుతుంది.. ఈ విషయంలో రామ్ దేవ్ బాబా కాస్త బెటరు” అని ట్వీట్ చేసింది. దీనికి హోలీ మెన్ అండ్ హెయిరీ టేల్స్ అనే ట్యాగ్ చేసింది.
దీనిపై రవిశంకర్ అభిమానులు మండిపడ్డారు. మనోభావాల్ని గాయపరిచిందని, దీనిపై తాము ఆమె భర్త అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 3 సినిమాను బహిష్కరిస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ డైరెక్టర్ దర్శక్ హాథీ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ట్వింకిల్ తాను రవిశంకర్పై చేసిన ట్వీట్ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే దర్శక్ హాథీపై విమర్శలు అదే సమయంలో దర్శక్ హాథీపై తీవ్ర విమర్శలు చేసింది. ట్వీట్ చేసింది నేనైతే నా భర్తను లాగడం ఏమిటని ప్రశ్నించింది. దీనిపై హాథీ కూడా వివరణ ఇస్తూ అక్షయ్ సినిమాతో తమకేం గొడవా లేదన్నారు. ఈ వివాదం సోషల్ మీడియాను కుదిపేసింది. ట్వింకిల్ ఖన్నాకు మద్దతు తెలుపుతూ చాలామంది పోస్ట్ చేశారు. హాథీ ట్వీట్స్ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్ఫూర్తికి అది విరుద్ధమని నెటిజన్లు మండిపడ్డారు.