Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉన్మాదిగా మారిన బిగ్‌ బాస్ పార్టిసిపెంట్ అర్మాన్.. సహజీవన భాగస్వామిపై?

బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్న వేళ, కో-పార్టిసిపెంట్‌ తనీషా ముఖర్జీతో రొమాన్స్‌ చేసిన అర్మాన్‌ను హౌస్ నుంచి గెంటేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ పోటీదారు అర్మాన్ కోహ్లీ తన సహజీవన భాగస్వామిపై దాడి చేశాడు. వివాదాస్

ఉన్మాదిగా మారిన బిగ్‌ బాస్ పార్టిసిపెంట్ అర్మాన్.. సహజీవన భాగస్వామిపై?
, మంగళవారం, 5 జూన్ 2018 (11:58 IST)
బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్న వేళ, కో-పార్టిసిపెంట్‌ తనీషా ముఖర్జీతో రొమాన్స్‌ చేసిన అర్మాన్‌ను హౌస్ నుంచి గెంటేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ పోటీదారు అర్మాన్ కోహ్లీ తన సహజీవన భాగస్వామిపై దాడి చేశాడు. వివాదాస్పద నటుడైన అర్మాన్ కోహ్లీ.. తన సహజీవన భాగస్వామి ఫ్యాషన్ స్టయిలిస్ట్ నీరూ రంధావాను హింసించాడు. దాడి చేశాడు. దీంతో గాయాలకు గురైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
నీరూను దారుణంగా కొట్టిన అర్మాన్, ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గత మూడేళ్లుగా నీరు, అర్మాన్ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఆర్థిక సంబంధిత అంశాలపై గొడవలు జరుగుతున్నాయి. గోవాలోని ఓ విల్లా అమ్మకం విషయంలో విభేదాలు తారస్థాయికి చేరగా, ఆదివారం రాత్రి, ఉన్మాదిలా మారిన కోహ్లీ, నీరూను జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. మెట్లపై నుంచి ఆమె జారి కిందపడింది. 
 
నీరూపై దాడి చేసిన కోహ్లీ ఆమెను బతిమాలుకున్నా.. ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. చాలాసేపటికి తేరుకుని ఆసుపత్రికి చేరుకున్న ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మా ఆయన నాకోసం పూలు తెచ్చారు... మురిసిపోయిన ఉపాసన