Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓ యువతిపై 143మంది అత్యాచారం కేసులో నాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ రాక్షసానందమా? యాంకర్ ప్రదీప్ ఫైర్

ఓ యువతిపై 143మంది అత్యాచారం కేసులో నాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ రాక్షసానందమా? యాంకర్ ప్రదీప్ ఫైర్
, గురువారం, 27 ఆగస్టు 2020 (18:45 IST)
ఓ యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ పేరు వుందంటూ ఓ సంచలన వార్త ప్రచారం జరుగుతోంది. తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్‌, బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ రెడీ చేశారు. 143మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. 
 
ఈ కేసులో యాంకర్ ప్రదీప్ పేరు వినిపించడం చర్చనీయాంశమైంది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు సైతం నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్‌ మీడియా వేదికగా యాంకర్‌ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 
 
ప్రదీప్ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుంటుంబాన్ని ఎంతో మానసిక కుంగుబాటకు గురిచేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్తున్నారు. సెన్సెటివ్ వివాదంలో తన పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారని.. అవతలి వ్యక్తులు తన పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారని వాపోయారు.
 
మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తోందని.. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలి కానీ నిజాలు తెలియకుండా తనను టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రదీప్ వెల్లడించారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్ లాక్ 4.0, సినిమా చూసేందుకు జనం థియేటర్స్‌కి వస్తారా?