Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు మళ్లీ కరోనా వైరస్ సోకింది : అమితాబ్ బచ్చన్

Advertiesment
amitabh
, బుధవారం, 24 ఆగస్టు 2022 (07:36 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మళ్లీ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం అర్థరాత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు మళ్లీ కరోనా వైర సోకిందని, అందువల్ల తనను కలిసివారందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 
 
బిగ్ బికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు. 
 
కాగా, అమితాబ్ కరోనా వైరస్ బారినపడటం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం కరోనా సోకినపుడు ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అలాగే, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్‌లు కూడా కోవిడ్ బారినపడి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, అమితాబ్ నటించిన "బ్రహ్మాస్త్రం" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, నాగార్జున, మౌనిరాయ్ తదితరులు నటిస్తున్నారు. అలాగే, గుడ్‌బై, ఊంచాయి సినిమాల్లోనూ నటిస్తున్నారు. రష్మిక మందన్నాతో కలిసి మరో చిత్రంలో నటించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచి హైట్‌, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి.. సురేఖా వాణి