Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బన్నీ కాలుమీద కాలేసి కూర్చున్నాడు.. అదీ కమల్ హాసన్ ముందు.. డీజేకు కొత్త చిక్కు..

డీజే సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ వున్న పాటపై వివాదం చెలరేగి సమసిపోయిన నేపథ్యంలో.. బన్నీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌లో ఆదరణ పొందుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌‌లో ఒక జట్టును రామ్ చరణ్ తేజ్‌తో కల

బన్నీ కాలుమీద కాలేసి కూర్చున్నాడు.. అదీ కమల్ హాసన్ ముందు.. డీజేకు కొత్త చిక్కు..
, శనివారం, 22 జులై 2017 (09:00 IST)
డీజే సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ వున్న పాటపై వివాదం చెలరేగి సమసిపోయిన నేపథ్యంలో.. బన్నీ మరో వివాదంలో చిక్కుకున్నాడు. భారత్‌లో ఆదరణ పొందుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌‌లో ఒక జట్టును రామ్ చరణ్ తేజ్‌తో కలిసి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
తమిళ జట్టును సొంతం చేసుకున్న అల్లు అర్జున్, చెర్రీ తమ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా కమల్ హాసన్‌‌ను నియమించారు. ఈ నేపథ్యంలో జట్టు ప్రమోషన్ కోసం ఈ ముగ్గురూ కలిసి చెన్నైలో జట్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా వేదికపై కమల్ హాసన్, రామ్ చరణ్ తేజ్ మామూలుగానే కూర్చున్నారు.
 
కానీ, అల్లు అర్జున్ మాత్రం కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు. ఇది తమిళ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటుడి ముందు అల్లు అర్జున్ కాలుమీద కాలేసుకుని కూర్చునేంత పెద్ద నటుడైపోయాడా.. అంటూ ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
లెజెండరీ నటుడే ఒద్దికగా కూర్చుంటే.. అల్లు అర్జున్ సీనియర్లు గౌరవం ఇవ్వకుండా అలా కూర్చోవడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. అసలే తమిళులకు భాషా, ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువ. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీళ్లు డీజేనీ వదల్లేదు.. బిగ్ బాస్‌నూ వదల్లేదు.. వీళ్లబాధేంటో మరి