Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితే మగాళ్ళకు మూడినట్టే : అలీ జాఫర్

మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Advertiesment
Ali Zafar
, మంగళవారం, 26 జులై 2016 (12:05 IST)
మహిళలు పరువు హత్యలకు శ్రీకారం చుడితో మగాళ్లకు మూడినట్టేనని బాలీవుడ్ నటుడు అలీ జాఫర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... ఆడవాళ్లు తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పరువు హత్యలు చేయడం అంటూ మొదలుపెడితే మగాళ్లకు మూడినట్టేనని, చాలా మంది చనిపోతారన్నారు. కాగా, పాకిస్థాన్‌కు చెందిన అలీ జాఫర్ బాలీవుడ్ నటుడిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. 
 
అలాగే, పాకిస్థాన్‌కు చెందిన వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్ పరువు హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత దారుణమన్నారు. పాకిస్థాన్‌లో ఇలాంటివి భవిష్యత్‌లో పునరావృతం కాబోవని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కబాలి' నాకు ఎంతో ఆనందాన్ని మిగిల్చింది.. నేనెప్పటికీ మరిచిపోలేను: నిర్మాత కలైపులి ఎస్ థాను