Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"అల వైకుంఠపురంలో.." టీజ‌ర్ రిలీజ్‌కి ముహుర్తం ఖరారు

, మంగళవారం, 10 డిశెంబరు 2019 (14:10 IST)
'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురంలో..' . ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని సాంగ్స్ పాపులర్ అయ్యాయి. 
 
దీంతో ఈ సినిమా థియేట‌ర్స్ లోకి ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు బ‌న్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న  ఈ సినిమాలో ఆయనకు  జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు.
 
అభిమానులు, సినీ జనాలు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ‘అల వైకుంఠపురంలో’ టీజర్ డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అఫిషియ‌ల్ గా ప్ర‌క‌టించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
 
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు 'గీతా ఆర్ట్స్' 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుస్తకం చదవలేక పోవచ్చు.. అంటే ఆ పుస్తకం బాగోలేదని కాదు... శ్వేతాబసు విడాకులు