Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్-శ్రియ కీచులాట... ఇటలీనే విడగొట్టిందా...?

అక్కినేని అఖిల్ - ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి ఇటలీలోని రోమ్ నగరంలో చేయాలని నిశ్చితార్థం రోజునే పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రోమ్ నగరంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకునేందుకు అఖిల్ తో కలిసి శ్రియా భూపాల్ ఆమె తల్లి వెళ్లేందుకు సిద

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్-శ్రియ కీచులాట... ఇటలీనే విడగొట్టిందా...?
, గురువారం, 23 ఫిబ్రవరి 2017 (15:57 IST)
అక్కినేని అఖిల్ - ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పెళ్లి ఇటలీలోని రోమ్ నగరంలో చేయాలని నిశ్చితార్థం రోజునే పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రోమ్ నగరంలో పెళ్లి ఏర్పాట్లు చేసుకునేందుకు అఖిల్ తో కలిసి శ్రియా భూపాల్ ఆమె తల్లి వెళ్లేందుకు సిద్ధమయ్యారట. ఈ క్రమంలో వారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారట. 
 
ఐతే ఏమయిందో తెలియదు కానీ ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకుని కీచులాడుకున్నారట. ఈ వాదన తారాస్థాయికి వెళ్లిపోవడంతో అఖిల్ అక్కడికక్కడే శ్రియా భూపాల్, ఆమె తల్లికి గుడ్ బై చెప్పేసి ఇంటికి వెళ్లిపోయాడట. ఆ సమయంలో అతడిని వారించి రోమ్ నగరానికి తీసుకెళ్లేందుకు అటు శ్రియ కానీ ఇటు ఆమె తల్లి కానీ పట్టించుకోలేదట. విషయం తెలిసిన తర్వాత నాగార్జున, శ్రియ తాతయ్య కృష్ణారెడ్డి ఇద్దరి మధ్యా సయోధ్యకు ప్రయత్నించినా లాభం లేకపోయిందట. దానితో ఎవరికివారు సైలెంట్ అయిపోయారట. చివరికి పెళ్లి ముహూర్తం తన్నుకొస్తుండటంతో టిక్కెట్లు బుక్ చేసుకోవద్దని ఇరు కుటుంబాల పెద్దలు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ కంటే శ్రియ పెద్ద.. బ్రేకప్ ఎప్పుడో అయిపోయింది.. నాగ్ సైలెంట్ అందుకేనా?