Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయి దుర్ఘ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి ఫిక్స్

Aishwarya Lakshmi

డీవీ

, శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (13:51 IST)
Aishwarya Lakshmi
కథానాయకుడు సాయి దుర్ఘ తేజ్ 'విరూపాక్ష,  'బ్రో' చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, అతను రోహిత్ కెపిని దర్శకుడిగా పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. తన 18వ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్ సంచలనాత్మక పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ చైతన్య రెడ్డి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అధిక బడ్జెట్‌తో చేస్తున్నారు.
 
ఈ చిత్రంలో ప్రధాన నటికి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది, అందుకే నిర్మాతలు సాయి దుర్ఘ తేజ్ సరసన నటించడానికి ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె పాత్ర వసంత. నేడు ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో, ఐశ్వర్య బంజరు భూములలో రిఫ్రెష్ గాలిగా చిత్రీకరించబడింది.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫిలిం సిటీ లో  వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరద బాధితులకు బాటిళ్లు, ఆహారాన్ని పంపిణీ చేసిన.విజయదేవర కొండ అభిమానులు