Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమలా పాల్‌కు కొత్త చిక్కు... బెంజ్ కారు కొని.. పన్ను చెల్లించకుండా?

సినీ నటి అమలా పాల్ కొత్త చిక్కులో పడింది. కారు నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంతో ఆమె ఇబ్బందిలో పడింది. ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు.

అమలా పాల్‌కు కొత్త చిక్కు... బెంజ్ కారు కొని.. పన్ను  చెల్లించకుండా?
, బుధవారం, 1 నవంబరు 2017 (10:37 IST)
సినీ నటి అమలా పాల్ కొత్త చిక్కులో పడింది. కారు నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారంతో ఆమె ఇబ్బందిలో పడింది. ఈ వ్యవహారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ విచారణకు ఆదేశించారు. అమలాపాల్ గత ఏడాది పుదుచ్చేరిలో "బెంజ్ ఎస్ క్లాస్" అనే కారును రూ.1.12 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ కారును ఆమె సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.20 లక్షలు పన్ను చెల్లించాల్సి వస్తుంది.
 
ఈ పన్ను చెల్లించేందుకు వెనక్కి తగ్గిన అమలాపాల్ పుదుచ్చేరిలోనే నకిలీ చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కారును అమలా పాల్ కేరళలో వినియోగిస్తోంది. కారు రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జోరుగా వార్తలు రావడంతో స్పందించిన గవర్నర్ నిజానిజాలేంటో తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశించారు. అమలాపాల్‌‌తో పాటు నటుడు భగత్ పాసిల్ సహా పలువురు నటులు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీచర్లను పెళ్లి చేసుకుంటే ఎంత కష్టమో తెలుసా?