Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం సబబే... పాక్ సింగర్‌ అద్నాన్ సమీ.. గాలిస్తున్న పాక్ ప్రజలు

పాకిస్థాన్‌ సింగర్ అద్నాన్ సమీ చిక్కుల్లో పడ్డారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపుదాడి చేయడాన్ని ఆయన స్వాగతిస్తున్నారు. ఈ దాడులు చేయడం సబబేనని వ్యాఖ్యానించారు.

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం సబబే... పాక్ సింగర్‌ అద్నాన్ సమీ.. గాలిస్తున్న పాక్ ప్రజలు
, శనివారం, 1 అక్టోబరు 2016 (15:19 IST)
పాకిస్థాన్‌ సింగర్ అద్నాన్ సమీ చిక్కుల్లో పడ్డారు. పాక్ ఆక్రమిక కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపుదాడి చేయడాన్ని ఆయన స్వాగతిస్తున్నారు. ఈ దాడులు చేయడం సబబేనని వ్యాఖ్యానించారు. 
 
యితే, ఆయ‌న‌పై పాక్‌లో పెద్ద ఎత్తున మండిప‌డ్డారు. వాటిపై ఆయ‌న తాజాగా స్పందిస్తూ త‌న‌ వ్యాఖ్యలపై పాక్ ప్ర‌జ‌లు తీవ్రంగా స్పందిస్తున్నార‌ని అన్నారు. వాటినిబ‌ట్టి త‌న‌కు ఆ దేశీయులు పాకిస్థాన్, టెర్రరిజం రెండింటినీ ఒకటేగా భావిస్తున్న‌ట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.
 
కాగా, బాలీవుడ్ ఎన్నో పాటలు పాడిన, పాక్ దేశస్థుడైన సింగర్ అద్నాన్ సమీకి ఇరు దేశాల్లో మంచి గుర్తింపు ఉంది. పైగా ఆయన భారత్ పౌర‌స‌త్వం తీసుకొని ఇక్కడే నివ‌సిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసివుంటారని పాక్ ప్రజలు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆటో డ్రైవర్‌ సెల్ఫీ కోసం వెంటపడిన నటి నమిత... ఎందుకో తెలుసా?