Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంట

వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానంటున్న 'వానపాటల' హీరోయిన్
, శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:22 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని టాలీవుడ్‌లో వానపాటల హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నటి వాణీ విశ్వనాథ్ హెచ్చరిస్తోంది. ఇంతకీ ఆర్జీవీపై ఆమె అంతలా కోపం పెంచుకోవడానికి కారణమేంటనే కదా మీ సందేహం. 
 
ఆర్జీవీ తెరకెక్కించనున్న 'లక్షీస్ ఎన్టీఆర్' సినిమాపై ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం చెలరేగింది. ఇప్పటివరకు వర్మపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా... తాజాగా, టీడీపీలో చేరుతానని ప్రకటించిన సినీ నటి వాణీ విశ్వనాథ్ కూడా ఆ జాబితాలో చేరారు. 
 
ప్రజలు దేవుడిగా చూసే ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగించేలా సినిమాను తీస్తే, చూస్తూ ఊరుకోబోమని... ఇలాంటి సినిమాను తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే ఆపేయాలని అన్నారు. లేనిపక్షంలో వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్‌లో రాముడిని, కృష్ణుడిని ప్రజలు చూసుకున్నారని అన్నారు.
 
ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను బాలకృష్ణ తీయబోతున్న తరుణంలోనే... ఇలాంటి సినిమాను తీయడానికి వర్మ ప్రయత్నిస్తుండటం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాకు వర్మ పెట్టిన పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉన్నాయని వాణీ విశ్వనాథ్ మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవర్ స్టార్...