Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రగ్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయింది : శ్రియారెడ్డి

కొందరు సినీ ప్రముఖులు చేసిన పాడుపనికి తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయిందని టాలీవుడ్ హీరోయిన్ శ్రియా రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజానికి గత కొన్ని రోజులుగా డ్రగ్స్ స్కామ్ తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుద

డ్రగ్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయింది : శ్రియారెడ్డి
, మంగళవారం, 18 జులై 2017 (09:51 IST)
కొందరు సినీ ప్రముఖులు చేసిన పాడుపనికి తెలుగు చిత్ర పరిశ్రమ పరువు పోయిందని టాలీవుడ్ హీరోయిన్ శ్రియా రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజానికి గత కొన్ని రోజులుగా డ్రగ్స్ స్కామ్ తెలుగు చిత్రపరిశ్రమను ఓ కుదుపు కుదుపుతోంది. డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటుల్లో పలువురు తమిళ సినిమాకీ సుపరిచితులే కావడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
 
ఈ నేపథ్యంలో 'పొగరు' చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ శ్రీయారెడ్డి. ఆ తర్వాత హీరో విశాల్ అన్నయ్యను వివాహం చేసుకొని కొంతకాలం నుంచి సినిమాలకు శ్రియారెడ్డి దూరంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో డ్రగ్స్ స్కామ్‌పై శ్రియారెడ్డి స్పందిస్తూ టాలీవుడ్‌ డ్రగ్స్‌ మాఫియాలో చిక్కుకోవడం దురదృష్టకరమని, డ్రగ్స్‌ వ్యవహారంతో తెలుగు పరిశ్రమ పరువు పోయిందన్నారు. ఇక తొమ్మిదేళ్ల తర్వాత 'అండావ కానోమ్‌'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, అవకాశాలు వస్తే తెలుగులోనూ నటిస్తానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ విషయాన్ని ఎందుకంత సంచలనం చేస్తున్నారు..ఎవరికి లాభమన్న రానా