Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వినోద రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణకు రంగం సిద్ధం... శోభన ఆధ్వర్యంలో...

కింగ్ నాగార్జున పరిచయ చిత్రం 'విక్రమ్' మొదలుకొని.. దక్షిణాదిలో గల అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభన.. ఇప్పుడు మరో రూపంలో తెలుగు సినిమా రంగంలో వి

వినోద రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణకు రంగం సిద్ధం... శోభన ఆధ్వర్యంలో...
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (17:05 IST)
కింగ్ నాగార్జున పరిచయ చిత్రం 'విక్రమ్' మొదలుకొని.. దక్షిణాదిలో గల అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభన.. ఇప్పుడు మరో రూపంలో తెలుగు సినిమా రంగంలో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. 'జాదూజ్' సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న 
పద్మశ్రీ శోభన.. తెలంగాణ ప్రభుత్వ 'టి.ఫైబర్'తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో జాదూజ్ ఏర్పాటు చేస్తున్న "జాదూజ్ సెంటర్" పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నారు.
 
ఇటీవల కాలంలో సామాన్యులకు దూరమైపోయిన సినిమాను వారికి మళ్లీ చేరువ చేయాలనే వజ్ర సంకల్పంతో టి.ఫైబర్‌తో కలిసి జాదూజ్ పని చేయనున్నది. ఈ సెంటర్స్ ద్వారా వినోదంతోపాటు.. గ్రామీణులకు విజ్ఞానాన్ని సైతం అందివ్వనున్నారు. తెలంగాణలో గల 8 వేల గ్రామాల్లో.. తొలి విడతగా 500 గ్రామాల్లో జాదూజ్ సెంటర్స్ నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ సెంటర్స్‌లో "చాయ్ నాస్తా కేఫ్"లు కూడా ఏర్పాటు కానున్నాయి. 
 
వీటి ద్వారా వంద మిలియన్ డాలర్ల (సుమారు 700 కోట్ల) ఆదాయంతోపాటు.. అయిదారు వేల మందికి ఆదాయం లభించనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ (ఐఏఎస్), తెలంగాణ ఫిల్మ్ డెవెలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పి.రామ్మోహన్ రావు, జాదూజ్ సీఈవో రాహుల్ మెహ్రా, రిక్లయిన్ ఎంటర్ టైన్మెంట్స్ సీయిఓ-ప్రముఖ నటుడు లోహిత్, ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్, హీరో శ్రీధర్ రావులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్రివిక్ర‌మ్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో వెంకీతోనా..? బ‌న్నీతోనా..?