Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లనివ్వమని అడిగిన మంత్రి... "ఫిదా" భామకు త్వరలో పెళ్లి...

'ఫిదా' చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె త్వరలోనే చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పనుందట. ఎందుకంటే.. ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుందనే వార్త హల్

పిల్లనివ్వమని అడిగిన మంత్రి...
, సోమవారం, 11 జూన్ 2018 (12:52 IST)
'ఫిదా' చిత్రంలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. ఈమె త్వరలోనే చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పనుందట. ఎందుకంటే.. ఈమె త్వరలోనే ఓ ఇంటికి కోడలు కాబోతుందనే వార్త హల్‌టస్ చేస్తోంది. ఆమె పెళ్లి చేసుకోబోయే వరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కుమారుడు. ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్త వివరాలను పరిశీలిస్తే...
 
ఏపీకి చెందిన మంత్రి సుపుత్రుడు హీరోయిన్ సాయిపల్లవిని చూసి మనసు పారేసుకున్నాడట. పైగా, ఈయనగారు కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనట. దీంతో తన మనసులోని మాటను ముందుగా సాయి పల్లవికి చెప్పగా, అందుకు ఆమె నో చెప్పిందట. దీంతో తన తండ్రితో సిఫార్సు చేయించాడట. 
 
సాక్షాత్తు మంత్రిగారు వచ్చి పిల్లనివ్వమని అడగడంతో సాయిపల్లవి పేరెంట్స్‌ కొద్దిగా ఇబ్బంది పడ్డారనీ, ఆ తర్వాత వారికి మంత్రిగారు సర్దిచెప్పడంతో ఓకే చెప్పినట్టు సమాచారం.
webdunia
 
అయితే, ప్రస్తుతం సాయిపల్లవి రెండుమూడు చిత్రాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. దీంతో ఈ చిత్రాల షూటింగ్‌లన్నీ పూర్తయిన తర్వాత పెళ్లి పెట్టుకుందామన్న కండిషన్‌తో సాయి పల్లవి తల్లిదండ్రులు ఓకే చెప్పారట. 
 
సో... ప్రస్తుతానికి మంత్రిగారి కొడుక్కి, సాయిపల్లవికి నిశ్చితార్థం చేసి ఆ తర్వాత పెళ్ళి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించిన్టు వినికిడి. కాకపోతే ఈ విషయంలో ఇరువైపుల నుంచి అధికారిక సమాచారం వెల్లడికావాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''టై ఎక్కడ'' అని అడిగిన చైతూ.. సమంత ఏం చేసిందంటే? (video)