Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరీ జగన్నాథ్‌కు ఏమైంది.. ఆయనకు నేను పనికిరానా? నటి హేమ

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వైఖరిపై హీరోయిన్ హేమ మండిపడింది. పూరీ తీరు ఏమాత్రం భావ్యంగా లేదన్నారు. ఎక్కడో ఉన్న వాళ్లను తీసుకువచ్చి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తాడు. ఇక్కడి వాళ్లనెందుకు తీసుకోడు అంట

Advertiesment
Actress Hema
, శనివారం, 18 మార్చి 2017 (12:33 IST)
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వైఖరిపై హీరోయిన్ హేమ మండిపడింది. పూరీ తీరు ఏమాత్రం భావ్యంగా లేదన్నారు. ఎక్కడో ఉన్న వాళ్లను తీసుకువచ్చి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తాడు. ఇక్కడి వాళ్లనెందుకు తీసుకోడు అంటూ మండిపడింది. 
 
ఇదే అంశంపై ఆమె ఓ వెబ్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె పూరీ జగన్నాథ్‌ను టార్గెట్ చేసింది. ‘తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు వాళ్లకు అవకాశాలు దక్కడం లేదని వాపోయింది. పూరీ నాకెందుకు మదర్‌ క్యారెక్టర్స్‌ ఇవ్వడు. ఎన్టీయార్‌కు తల్లిగా కనిపించే స్టేచర్‌ నాకు లేదా? నాకు సినీ పరిశ్రమలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏదైనా చెప్పే అర్హత, హక్కు నాకుందని' వ్యాఖ్యానించింది. 
 
కాగా, టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో నటి హేమ ఒకరు. రెండేళ్ల క్రితం జరిగిన ‘మా’ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి మరింత పాపులర్‌ అయింది. ఇటీవలే తెలుగు సినీ పరిశ్రమపై పలు విమర్శలు కూడా చేశారు ఇపుడు పూరీ జగన్నాథ్‌ గురించి, సోషల్‌ మీడియా గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రకుల్‌ ప్రీత్ సింగ్‌ ఖాతాను ఓపెన్ చేసిన రానా - అఖిల్... విశాఖలో సందడి...