Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.కోట్లు వసూలు చేసి స్వాహా... చీటింగ్ కేసులో హీరోయిన్ అరెస్టు

చీటింగ్ కేసులో కేరళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ ధన్య మేరీ వర్గీస్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై ఈమెను అదుపులోకి తీసుకున్నారు.

రూ.కోట్లు వసూలు చేసి స్వాహా... చీటింగ్ కేసులో హీరోయిన్ అరెస్టు
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (16:10 IST)
చీటింగ్ కేసులో కేరళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ ధన్య మేరీ వర్గీస్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మోసానికి పాల్పడిన ఆరోపణలపై ఈమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
కేరళ రాజధాని తిరువనంతపురం పరిసరాల్లో నిర్మిస్తున్న నోవా కాజిల్ ఫ్లాట్ కాంప్లెక్స్‌లో తమకు అపార్ట్‌మెంట్లు ఇప్పిస్తామని ధన్య భర్త జాన్ జాకబ్‌కు చెందిన సంస్థ శాంసన్ అండ్ సన్స్ ద్వారా కోట్లాది రూపాయలూ కాజేశారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ధన్యతోపాటు ఆమె భర్త జాన్ జాకబ్‌స సోదరుడు శామ్యూల్‌లను కూడా అరెస్టు అయ్యారు. శాంసన్ అండ్ సన్స్ సంస్థ తమిళనాడులోని నాగర్‌కోయిల్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరంతా కలిసి బాధితులు ఒకొక్కరి నుంచి రూ.40 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ మొత్తం 100 కోట్ల రూపాయల మేర వసూళ్ళు చేసి ముఖం చాటేస్తున్నట్లు కేసులు నమోదయ్యాయి. 
 
ధన్య మామ జాకబ్ శాంసన్‌ని గతంలోనే క్రైం డిటాచ్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. 2014 నుంచీ ఈ కేసు నడుస్తోంది. 31 సంవత్సరాల ధన్య తమిళ సినిమా 'తిరుడి' (దొంగ) చిత్రం ద్వారా 2006లో సినీ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత మలయాళ రంగంలోకి అడుగుపెట్టారు. పలు సినిమాల్లో తన నటనతో ఉత్తమ నటిగా అవార్డులు కూడా అందుకున్నారు. జాన్ కూడా పలు సినిమాల్లో నటించాడు. 2012లో వివాహం చేసుకున్న ధన్య, జాన్ జంటకు మూడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైంపాస్‌ పాప్‌కార్న్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'... రివ్యూ రిపోర్ట్