Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దొంగిలించిన వస్తువులు తెస్తానని చెప్పి మాపై కేసు పెట్టింది : భానుప్రియ

Advertiesment
Bhanupriya
, శుక్రవారం, 25 జనవరి 2019 (08:38 IST)
తన ఇంట్లో పని చేసే పని అమ్మాయిని తన సోదరుడు వేధించాడంటూ సామర్లకోట పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుపై సినీ నటి భానుప్రియ స్పందించింది. కుమార్తె దొంగిలించిన వస్తువులు తీసుకొస్తానని చెప్పి.. చివరకు తమపైనే బాలిక తల్లి తమపైనే కేసు పెట్టిందని భానుప్రియ చెప్పుకొచ్చింది. 
 
తన తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని వేధించారంటూ తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్‌లో భానుప్రియపై కేసు నమోదైంది. దీనిపై భానుప్రియ స్పందిస్తూ, సంధ్య(14) అనే బాలిక తమ ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తోందని.. ఈ క్రమంలో దాదాపు రూ.లక్షా 50 వేల విలువైన డబ్బు, బంగారం, కెమెరా, ఐప్యాడ్‌ను దొంగిలించిందని చెప్పింది. 
 
ఈ విషయమై సంధ్యను నిలదీసి అడిగితే కానీ నిజం చెప్పలేదని.. వెంటనే ఆమె తల్లికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకెళ్లమని చెప్పినట్టు భానుప్రియ తెలిపారు. సంధ్య తల్లి తన ఇంట్లో దొంగిలించిన కొన్ని వస్తువులను తెచ్చి ఇచ్చిందని.. మరికొన్నింటిని తీసుకొస్తానని వెళ్లి తనపైనే కేసు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ అవాస్తవాలుగా కొట్టిపడేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనిపిల్లపై నటి భానుప్రియ సోదరుడి లైంగికదాడి...