Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరోసారి చెన్నై వస్తే, మా ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందే : ధోనీకి హీరో సూర్య ట్వీట్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోలీవుడ్ హీరో సూర్య ఈ విజ్ఞప్తి చేశారు. మరోమారు చెన్నైకు వస్తే ఖచ్చితంగా తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందేనంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Advertiesment
Actor Surya
, శనివారం, 24 సెప్టెంబరు 2016 (15:49 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కోలీవుడ్ హీరో సూర్య ఈ విజ్ఞప్తి చేశారు. మరోమారు చెన్నైకు వస్తే ఖచ్చితంగా తమ ఇంటికి డిన్నర్‌కు రావాల్సిందేనంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. 
 
ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎమ్‌ఎస్‌ ధోని: ది అన్‌ టోల్డ్‌ స్టోరీ'. ఈ చిత్రం ప్రమోషన్‌ నిమిత్తం ఎంఎస్.ధోనీ చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా, భార్య జ్యోతిక, పిల్లలు దివా, దేవ్ సహా సూర్య ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
సూర్య పిల్లలు ధోనీతో కొంతసేపు గడుపగా, ఈ ఫోటోలను సూర్య పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా సూర్య ఓ ట్వీట్ చేశాడు. "మరోసారి చెన్నై వస్తే మాతో డిన్నర్ చేయాలి. మీరు చూపిన ఆప్యాయతకు ధన్యవాదాలు. మా పిల్లలకు మధురమైన క్షణాలను అందించారు" అంటూ తన ట్వీట్‌‌లో సూర్య పేర్కొన్నారు. కాగా, ధోనీ బయోపిక్ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదేళ్లు చిన్నవాడైన రణబీర్‌తో రొమాన్స్ చేసిన ఐష్... రొమాంటిక్ సీన్స్ అదిరిపోయాయట