Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోండి: రంభకు కోర్టు ఆదేశం

సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

మీ ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని మాట్లాడుకోండి: రంభకు కోర్టు ఆదేశం
, మంగళవారం, 21 మార్చి 2017 (14:54 IST)
సినీ నటి రంభకు చెన్నై ఫ్యామిలీ కోర్టులో చుక్కెదురైంది. తనను తన భర్తతో కలపాలని, ఆయన్నుంచి నెలకు రూ.2.5 లక్షలు భరణంగా ఇప్పించాలని కోరుతూ ఆమె చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఇది కుటుంబ సమస్య కాబట్టి, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. కెనడాకు చెందిన ఇంద్రకుమార్‌ను రంభ 2010లో ప్రేమ వివాహం చేసుకోగా, ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో.. ఆ దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రంభ భర్తను వదిలి చెన్నైకు వచ్చేసింది. ఆ తర్వాత చెన్నై కోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రాగా, ఓ న్యాయవాదిని నియమించిన కోర్టు, ఆమెను, ఇంద్రకుమార్‌ను ఓ గదిలో ఉంచి మాట్లాడుకుని, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే, తాము కల్పించుకుంటామని తేల్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే సాయి ధరమ్ అంటే మహాయిష్టం : రకుల్ ప్రీత్ సింగ్