Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు.. లక్ష్యపై దాడులు

మలయాళ నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ఇన్వస్టిగేషన్ టీమ్ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరా

దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు.. లక్ష్యపై దాడులు
, బుధవారం, 26 జులై 2017 (09:59 IST)
మలయాళ నటిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసులో నటుడు దిలీప్ భార్య కావ్యా మాధవన్‌ను ఇన్వస్టిగేషన్ టీమ్ ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్‌కు బెయిల్ ఇచ్చేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. బయటకు వెళ్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్ట్ కావడంతో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) నుంచి దిలీప్‌ను సస్పెనండ్ చేశారు. ప్రస్తుతం దిలీప్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
 
ఈ నేపథ్యంలో దిలీప్ భార్యను అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) బి.సంధ్య ఆధ్వర్యంలోని బృందం అలువాలోని దిలీప్ ఇంట్లో ప్రశ్నించింది. నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత తాను కొచ్చిలో కావ్య నిర్వహిస్తున్న ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీ ‘లక్ష్య’కు వెళ్లినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్ సునీ దర్యాప్తులో వెల్లడించాడు. దీంతో లక్ష్యపై పోలీసులు దాడులు నిర్వహించారు. కావ్యా మాధవన్‌ను కూడా ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసులో ఇరుక్కుంటే ఇరుక్కుంది కానీ పదిసినిమాల పెట్టు ప్రచారం సంపాదించేసింది.