Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరేళ్ళుగా వేధిస్తున్నాడు... 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యా మీనన్

nithya menon
, ఆదివారం, 7 ఆగస్టు 2022 (14:17 IST)
మలయాళ నటి నిత్యామీనన్ తనకు ఎదురైన వేధింపులపై తాజాగా స్పందించారు. సంతోష్ వర్కీ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ ఆరేళ్ళుగా వేధిస్తున్నాడని, అతనికి చెందిన దాదాపు 30 నంబర్లను బ్లాక్ చేసినట్టు చెప్పాడు. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ, "కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి. 
 
నిజం చెప్పాలంటే, అతడు దాదాపు ఆరేళ్ల నుంచి నన్నూ, నా కుటుంబాన్నీ వేధిస్తున్నాడు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశా. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడు. దాంతో మా ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నోసార్లు చెప్పారు. 
 
కానీ నేను అలా చేయకుండా క్షమించి వదిలేశా. అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. కానీ అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు  చేస్తున్నాడు" అని నిత్యామేనన్‌ వివరించారు.
 
ఇక, నిత్యామేనన్‌ త్వరలోనే ఓ బిజినెస్‌ మ్యాన్‌ని వివాహమాడనున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఎంతోకాలం నుంచి ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. అవన్నీ అవాస్తవాలేనంటూ నిత్య ఓ వీడియో సందేశంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టిన విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైపర్ ఆదికి ముద్దుపెట్టబోయిన శ్రద్ధాదాస్..