Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్...? బాలయ్య కెరీర్‌లోనే?

పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్

Advertiesment
28th July
, మంగళవారం, 25 జులై 2017 (14:43 IST)
పైసా వసూల్ సినిమా ఎప్పుడొస్తుందానని నందమూరి ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. పైసా వసూల్ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ సినిమా టీజర్ ఎప్పుడొస్తుందానని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరలో టీజర్ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుంది. 
 
ఈ టీజర్లో మాస్‌ను ఆకట్టుకునే సీన్లుంటాయని సమాచారం. తప్పకుండా సినిమాపై పైసా వసూల్ టీజర్ మరింతగా అంచనాలు పెంచేలా ఉంటుందని సినీ యూనిట్ సమాచారం. ఇంతవరకూ బాలకృష్ణ సినిమాల్లో పైసా వసూల్ రూ.40 కోట్లకు పైగా వెచ్చించడంతో అత్యధిక బడ్జెట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి ఇంతవరకూ రూ.47 కోట్లు ఖర్చు చేశారట. మరో మూడు కోట్లవరకూ ఖర్చయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ జనం అంటున్నారు.
 
తాజాగా పైసా వసూల్‌పై డ్రగ్స్ దందా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందని.. దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై డ్రగ్స్‌ ఆరోపణలు రావడంతో ఈ సినిమాపై మాస్ ఆడియన్స్ మినహా ఇతరులు ఆసక్తి చూపరని సినీ జనం అంచనా వేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జై లవ కుశలో రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్.. సెప్టెంబర్ 21న రిలీజ్..