Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి అయితే... సో వాట్ : సైరా ప్రచారానికి దూరంగా నయనతార

Advertiesment
Sye Raa
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (10:39 IST)
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించగా, వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటించగా, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
 
ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ఇటీవల ముంబైలో జరిగిన సైరా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఒక్క నయనతార మినహా మిగిలిన అగ్ర నటీనటులంతా పాల్గొన్నారు. దీంతో నయనతార.. 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో కనిపించటం కూడా అనుమానమే అన్న టాక్‌ వినిపిస్తోంది.
 
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకుడు. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కించారు. 
 
నిజానికి నయనతార సినిమాలో నటించిన తర్వాత ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. ఈ పంథానే సైరా నరసింహా రెడ్డికి కూడా ఆమె అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర హీరోల చిత్రాలమాదిరిగానే చిరంజీవి చిత్రాన్ని కూడా ఆమె చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ హాస్య నటి మధుమితపై బిగ్ బాస్ నిర్వాహకుల కేసు