Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి చిరంజీవి బై చెప్పేస్తారా? కారణం ఏమిటి?

''మీలో ఎవరు కోటీశ్వరుడు'' మూడు సీజన్లు అక్కినేని నాగార్జున హోస్ట్‌లో బాగా హిట్టయ్యాయి. కానీ నాలుగో సీజన్‌కు కింగ్ నాగార్జునకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ ఇవ్వడంతో.. తప్పకుండా మా టీవీ రేటింగ్ అమ

''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి చిరంజీవి బై చెప్పేస్తారా? కారణం ఏమిటి?
, శుక్రవారం, 12 మే 2017 (16:33 IST)
''మీలో ఎవరు కోటీశ్వరుడు'' మూడు సీజన్లు అక్కినేని నాగార్జున హోస్ట్‌లో బాగా హిట్టయ్యాయి. కానీ నాలుగో సీజన్‌కు కింగ్ నాగార్జునకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ ఇవ్వడంతో.. తప్పకుండా మా టీవీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్పీ రేటింగ్ రేంజ్ పెరిగిపోతుందనుకున్న వారికి గట్టి షాక్ తగిలింది.

చిరంజీవి నిర్వహించే ''మీలో ఎవరు కోటీశ్వరుడు''కి టీఆర్పీ రేటింగ్ పెరగలేదట. అంతేకాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ షో రేటింగ్ మాత్రం పుంజుకోలేదు. దీంతో ఈ షో నుంచి తప్పుకోవాలని చిరు డిసైడైయ్యారు. పనిలో పనిగా ఈ నెలతో ఈ సీజన్ పూర్తి కానుంది. ఈ సీజన్‌తోనే ఈ ప్రోగ్రామ్ నుంచి చిరంజీవి తప్పుకోవాలని భావిస్తున్నారు.
 
సెప్టెంబర్ నుండి చిరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌లో చిరు బిజీ అయిపోతారని.. అందుకే ఈ ప్రోగ్రామ్‌ను పక్కనబెట్టేయాలనుకుంటున్నారు. ఉయ్యాలవాడ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చి వరకు జరగనుంది. కాబట్టి అప్పటివరకు చిరంజీవి ఫుల్ బిజీ కావడంతో ఈ కార్యక్రమంపై కన్నేయలేకపోవచ్చు. అందుకే ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పుకోవాలని మెగాస్టార్ డిసైడైపోయినట్లు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైట్స్ రూ.80 కోట్లు... పబ్లిసిటీకి రూ.10 కోట్లు.. లాభం రూ.285 కోట్లు : ఇది హిందీ బాహుబలి స్టామినా